కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 10: సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ డెయిరీలో బుధవారం నిర్వహించిన రంగవల్లులు అలరించాయి. రైతు కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క రంగుల్లో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
ముందుగా నాబార్డు అధికారులు పోటీలను ప్రారంభించగా, కలెక్టర్ పమేలా సత్పతి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు, ఎండీ శంకర్రెడ్డి, సలహదారు హనుమంతరెడ్డి పాల్గొన్నారు.