కొత్తపల్లి, జనవరి 9 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సె యింట్ థామస్ ఉన్న త పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 11 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఇటీవల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రుక్మాపూర్లో జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో గణిత విభాగం సీనియర్స్ కేటగిరిలో మొదటిస్థానం సాధించిన సాయి శ్రీనిక రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపికైంది.
ఈ సందర్భంగా శ్రీనికను సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కడారి అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటి జాతీయస్థాయికి ఎంపిక కావాలన్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.