జ్యోతినగర్, జనవరి 5 : న్యూజిలాండ్ దేశానికి చెందిన ముగ్గురు ఆటోలో చేపట్టిన సాహసయాత్ర శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చేరింది. న్యూజీలాండ్కు చెందిన జాక్ కెనడీ, హవినీశ్ మైకల్ సన్, జాయల్ హడ్స్ ముగ్గురు కేరళ నుంచి గౌహతికి ఆటోలో సాహస యాత్ర చేస్తున్నారు.
ఆటోను వారే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. భోజన విరామ సమయంలో ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్రోడ్లో కొద్దిసేపు ఆగి సాన్వీ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా వీరి ఆటో ప్రయాణం రామగుండంవాసులను ఆలోచింపజేయగా, 15 రోజుల పాటు జరిగే వీరి సాహసయాత్రను పలువురు ప్రశంసించారు.