అర్ధరాత్రి సీపీకి ఫోన్కాల్
స్పందించిన కమిషనర్
రంగంలోకి దిగిన రెస్క్యూ టీం
ఏసీపీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్
సురక్షితంగా కాపాడిన పోలీసులు
రాంనగర్, జూన్ 27: సమయం అర్ధరాత్రి 12 గంటలు.. అంతా గాఢ నిద్రలో ఉండే వేళ.. అప్పు డే పోలీస్ పెద్దసారుకు ఫోన్ కాల్.. ‘సార్ మా పిల్లి బావిలో పడ్డది. ప్లీజ్ కాపాడండి’ అని వినతి. ఆ పెద్దసారు అంతే వేగంగా స్పందించారు. ఆ వెంటే ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు పిల్లిని కాపాడి యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. వివరాలు.. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన శ్రీకాంత్ కుటుంబం పిల్లిని పెంచుకుంటున్నది. ఆదివారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతం లో ఆ పిల్లి ప్రమాదవశాత్తూ వారి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడ్డది. దీంతో కుటుంబంలో ని యువతి వెంటనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసింది. పిల్లి బావిలో ప డ్డదని, కాపాడాలని కోరింది.
పిల్లే కదా అని ఫోన్ పెట్టేయకుండా సీపీ స్పందించారు. వెంటనే చర్య లు తీసుకోవాలని టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్రావును ఫోన్లో ఆదేశించారు. కాంట్రాక్ట్ నంబర్ ఆధారంగా టౌన్ ఏసీపీ హెడ్ కానిస్టేబుల్ అంజిరెడ్డి, మరి కొంతమంది సిబ్బందిని రెస్క్యూ టీంగా ఏర్పాటు చేసి అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 12.45 గంటల మధ్యన రెస్క్యూ ఆపరేషన్ చేశారు. బావిలోకి ఒక బుట్టను పంపించి అందు లోకి వచ్చిన తర్వాత పిల్లిని బయటికి లాగి సురక్షితంగా బయటికి తీశారు. అర్ధరాత్రి ఫోన్కాల్కు స్పందించి రెస్క్యూ చేసిన పోలీసులకు ఆ పిల్లి యజమాని శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు.. ఎ సమయానికి ఫోన్ చేసినా డయల్ 100కు కాల్ చేస్తే స్పందిస్తామని, ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసమే ఉంటారని చెప్పారు.