సిరిసిల్ల నేతన్నల గురించి ఎంత చెప్పినా తక్కువ. పట్టుచీరలు నేయాలంటే వాళ్ల తర్వానే ఎవరైనా.. రకరకాల డిజైన్లతో పట్టు చీరలను హ్యాండ్లూమ్ ద్వారా తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించారు. తాజాగా సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే నేతన్న తన అద్భుతమైన ప్రతిభతో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశాడు. అలాగే.. దబ్బనంలో దూరే చీరను కూడా తయారు చేశారు. ఈ రెండు చీరలను ఒక గ్రామ్ గోల్డ్ జరీ పట్టును ఉపయోగించి తయారు చేశాడు. నేతన్న ప్రతిభను చూసి స్థానికులు మెచ్చుకున్నారు.