రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఆదాయం పెంచి పేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో నిర్మించిన గొర్రెల షెడ్లను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అదేవిధంగా ఎక్కడాలేని విధంగా సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు భరోసా కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. కొంతమంది దారుణంగా మాట్లాడుతున్నారన్న మంత్రి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి ఏమిటని నిలదీయాలని పేర్కొన్నారు.