కరీంనగర్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనగోళ్లు పూర్తయ్యాయి. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడడంతో ప్రభుత్వ కొనుగోళ్లు కాస్త తగ్గాయి. ధాన్యం కొన్న వెంటనే రైతులకు దాదాపు చెల్లింపులు జరిపారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన కొనుగోళ్లు ఈనెల 20 వరకు కొనసాగాయి.
కరీంనగర్ జిల్లాలో 2.78 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ..
కరీంనగర్ జిల్లాలో వానకాలం సీజన్లో 2,78, 552.120 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా అధికారులు అదే విధంగా కేంద్రాలను నిర్వహించారు. ఆలస్యంగా కోతకు వచ్చిన కొన్ని ప్రాంతాల రైతులకు వెసులుబాటుగా అక్కడి కేంద్రాలను చివరి వరకు కొనసాగించారు.
ఈ నెల 20 వరకు చివరి గింజ వరకు కొన్న తర్వాత కేంద్రాలను పూర్తి స్థాయిలో మూసివేశారు. 341 కేంద్రాలు తెరవాలని అధికారులు ప్రతిపాదించగా అవసరమైన చోట కేంద్రాలను తెరిచి కొనుగోళ్లు జరిపా రు. ఇందులో భాగంగా ఐకేపీ నుంచి 52 కేం ద్రాలను తెరిచి 8,059 మంది రైతుల నుంచి 38,985.160 మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహించిన 222 కేంద్రాల ద్వారా 41,100 మంది రైతుల నుంచి 2,04,704.680 మెట్రిక్ టన్నులు, డీసీఎమ్మెస్ నిర్వహించిన 47 కేంద్రాల ద్వారా 6,279 మంది రైతుల నుంచి 33,668.960 మెట్రిక్ టన్నులు, హాకా కేంద్రం నిర్వహించిన ఒక కేంద్రం ద్వారా 326 మంది రైతుల నుంచి 1,193.320 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తంగా 55,764 మంది రైతుల నుంచి 2,78,552.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే, జగిత్యాల జిల్లా నుంచి 9,960.400, సిరిసిల్ల జిల్లా నుంచి 8,423.280 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుని జిల్లాలోని మిల్లర్లకు మొత్తం 2,96,935 లక్షల మెట్రిక్ టన్నులు సీఎంఆర్ కోసం అప్పగించారు.
రైతుల ఖాతాల్లోకి 573.20 కోట్లు
ధాన్యం కొనుగోళ్లు జరిపిన క్రమంలోనే రైతుల ఖా తాల్లో ఎప్పటికప్పుడు అధికారులు నగదు జమచేస్తూ వచ్చారు. జిల్లాలో 2,78,552.120 మెట్రి క్ టన్నుల ధాన్యానికి రూ.573 కోట్ల 81 లక్షల 73 వేల 672 చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 2,78,252.427 మెట్రిక్ టన్నుల వరకు రూ.573.20 కోట్లు చెల్లించారు. ఇంకా కేవలం 299.693 మెట్రిక్ టన్నులకు సంబంధించిన రూ.61,73,670 మాత్రమే చెల్లించాల్సి ఉంది. మిగిలిన నగదు కూడా రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి వానకాలం సీజన్లో అధికారులు ధాన్యం కొనుగోళ్లను విజయవంతగా ము గించారు. ఎప్పటికప్పుడు తమ ఖాతాల్లో నగదు జమచేసిన నేపథ్యంలో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు రానీయ లేదు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఏ రైతుకూ ఇబ్బంది రా కుండా వానకాలం ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేశాం. వానకాలంలో కొంత ఆలస్యంగా వరి నాట్లు వేసిన రైతులకు వెసులుబా టు ఉండే విధంగా ఈసారి దాదాపు 94 రో జుల పాటు చివరి గింజ వరకు కొనుగోళ్లు జరి పాం. ఇంకా ఎవరైనా ఉంటే ఈ నెల 24 వర కు అమ్ముకునే అవకాశం ఇచ్చాం. సహకరించిన రైతులకు ధన్యవాదాలు. కొనుగోళ్లను విజయవంతంగా ముగించిన అధికారులకు అభినందనలు. ఈసారి రైతుల ఖాతాల్లోనూ ఎప్పటికప్పుడు నగదు జమచేశాం. మిగిలిన కొందరికీ త్వరలోనే చెల్లిస్తాం..
– రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్