పెగడపల్లి, డిసెంబర్ 20: మండలంలోని 30 కొనుగోలు కేం ద్రాల ద్వారా 2.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించి 90 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమచేశామని అధికారులు తెలిపారు. పెగడపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలోని 10 సెంటర్ల నుం చి 1.05 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశామని చైర్మన్ వోరుగంటి రమణారావు, సీఈవో తడ్కమడ్ల గోపాల్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 8 కేంద్రాల ద్వారా 43500 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు ఏపీఎం డీ సమత వెల్లడించారు.
నంచర్ల సింగిల్ విండో పరిధిలో 8 కేంద్రాల ద్వారా 44 వేల క్వింటాళ్ల కొనుగోలు చేసినట్లు విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, సీఈవో రౌతు మధుకర్ తెలిపారు. అలాగే నందగిరి సొసైటీ పరిధిలోని 4 కేంద్రాల నుంచి 27500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సంఘ చైర్మన్ కర్ర భాస్కర్రెడ్డి, సీఈవో రవీందర్రెడ్డి వివరించారు.
కథలాపూర్, డిశంబర్ 20 : ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 15వేల 230 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏపీఎం నరహరి బుధవారం తెలిపారు. అంబారిపేటలో 9367.6 క్వింటాళ్లు, బొమ్మెనలో 8156 క్వింటాళ్లు, భూషణ్రావుపేటలో 9200.6, చింతకుంటలో 7306.8, దులూరులో 10445.6, కథలాపూర్లో 12835.6 , పెగ్గెర్లలో 9077.6, పోతారంలో 14808 ్ల, సిరికోండలో 8290 , తక్కళ్లపెల్లిలో 10500 క్వింటాళ్లు, తాండ్రియాలో 15242 క్వింటాళ్లు వడ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.