ముకరంపుర, ఫిబ్రవరి 1: ఎన్పీడీసీఎల్ ఉమ్మడి కరీంనగర్ సరిల్లో జేఎల్ఎం అభ్యర్థులకు గురువారం నిర్వహించిన పోల్ ైక్లెంబింగ్ పరీక్ష ముగిసింది. కరీంనగర్ సరిల్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష ప్రారంభమైంది. చైర్మన్గా కరీంనగర్ సరిల్ ఎస్ఈ వీ గంగాధర్, కన్వీనర్గా పీవో బీ చంద్రయ్య, మెంబర్లుగా మరో ఇద్దరు డీఈలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జిల్లా ముఖ్య పరిశీలకులైన వరంగల్లోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు సీజీఎం(హెచ్ఆర్డీ) సీ ప్రభాకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2018లో 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించామన్నారు.
సెలక్ట్ అయిన వారికి పోల్ ైక్లెంబింగ్ మూడు దశల్లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలో 250 పోస్టులు మిగిలాయని, ఆ పోస్టులు తమతో భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం, వారికి వచ్చిన మారుల ఆధారంగా నాలుగవ దశలో ఉమ్మడి కరీంనగర్ సరిల్ పరిధిలో 52మందికి పోల్ ైక్లెంబింగ్ పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టినట్లు పేరొన్నారు. ఎంపిక పారదర్శకంగా నిర్వహించామన్నారు. స్తంభం ఎకి, దిగే సమయంలో ప్రతి అభ్యర్థిని వీడియో తీయడంతో పాటు సీసీ కెమెరా బిగించినట్లు వివరించారు. కాగా సాయంత్రం గంటల వరకు 50మంది టెస్ట్కు హాజరయ్యారని ఎస్ఈ గంగాధర్ తెలిపారు.