రాంనగర్, డిసెంబర్ 22 : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 13వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం 1234 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 984మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 556 మంది అర్హత సాధించారు. 428మంది అర్హత సాధించలేకపోయారు. 126 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 124మంది అభ్యర్థులు అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం సదరు అభ్యర్థులకు ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతించారు.
తొలుత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఎఎఫ్ఐడి బిబ్ జాకెట్లను ధరింపజేశారు. 1600 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతో పాటు లాంగ్ జంప్, షార్ట్ పుట్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రతి విభాగం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీజీ చంద్రమోహన్, ఏసీపీలు మదన్లాల్, వెంకట రెడ్డి, విజయ్ కుమార్, ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం, సూపరింటెండెంట్ ఏవీఎన్ చారి, మినిస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది, ఇన్స్పెక్టర్లు మాధవి, రవీందర్, బి సంతోష్ కుమార్, రవీందర్, ఆర్ఐలు జానిమియా, కిరణ్ కుమార్, మురళి, రమేశ్, మల్లేశం, సురేశ్తో పాటు పలువురు పోలీసు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.