పెద్దపల్లి/ సుల్తానాబాద్ నవంబర్ 4: చేసిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలను చూసి తనను ఆదరించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెసోళ్లను నమ్మి నట్టేట మునగవద్దని హితవు చెప్పారు. జూలపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మల్లెత్తుల నర్సయ్య, కమ్మం సతీశ్ ,కొట్టె నరేశ్, మల్లెత్తుల నర్సయ్య, మల్లెత్తుల రమేశ్, మల్లెత్తుల మహేశ్, ఎండీ అసద్, గైని రామకృష్ణ, కనపర్తి రాజేశ్, వొళ్లాజీ మహేశ్, లక్షేట్టి సాయి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నగునూరి సతీశ్, అలాగే మాజీ జడ్పీటీసీ గుర్రాల మల్లేశం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం వైస్ప్రెసిడెంట్ చొప్పరి శ్రీనివాస్, డైరెక్టర్లు కంకణాల శ్రీనివాస్, భూతగడ్డ కనుకయ్య శనివారం గులాబీ పార్టీలో చేరారు.
వీరికి దాసరి పెద్దపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్తో కలిసి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే నమ్మకం..కాంగ్రెస్ది ద్రోహం అని వ్యాఖ్యానించారు. ప్రజలు నమ్మకంవైపు ఉండాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమాల్లో ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఈసారపు వెంకటేశం, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ లోక రవీందర్ రెడ్డి, మంద అంజయ్య, మల్లెత్తుల కనకయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు పొలగాని సతీశ్, తాజుద్దీన్, మేర శ్రీనివాస్, గంగిపెల్లి శ్రీనివాస్, మహమ్మద్ అంకూస్, బాణాల కొమురయ్య, సుల్తానాబాద్లో కంకణాల సతీశ్, పోచవేని రవి, ఉస్తేం లక్ష్మీనారాయణ ఉన్నారు.