పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి మండలం కనగర్తి, మూలసాల గ్రామాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉప కేంద్ర భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.