ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ఇబ్రహీంపట్నంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : దేశంలో ఎక్క డా లేనివిధంగా పేదలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. మండ ల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మంగళవారం డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన రైతుబంధు క్యాలెండర్ను ఆవిష్కరించారు. రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో 16 మంది లబ్ధిదారులకు రూ.16,01, 856 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. నియోజకవర్గంలో గ్రామానికి ఒకటి చొప్పున దళిత బంధు యూనిట్ను అందిస్తున్నామని, త్వరలోనే విడుతల వారీగా దళితులందరికీ దళిత బంధు సీఎం కేసీఆర్ అందించనున్నారన్నారు. బీసీ, ఓసీలలోని నిరుపేదలకు బీసీ, ఓసీ బంధు అందించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నచోట నూతన భవనాల నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటి సారిగా ఇబ్రహీంపట్నం రావడంతో పలువురు నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు మేడిపల్లి క్రాస్రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకు టీఆర్ఎస్ నాయకులు మోటార్ సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేమూరి లత, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, జడ్పీటీసీ కంఠం భారతి, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు జంగద్యావతి సరస్వతి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకట్, మార్క్ఫెడ్ డీఎం దివ్యభారతి, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి షాహిద్ అలీ, రైతుబంధు మండలాధ్యక్షుడు సుగుణాకర్ రావు, రైతుబంధు గ్రామ శాఖ అధ్యక్షుడు నేమూరి సత్యనారాయణ, మండల కోఆప్షన్ స భ్యులు చిన్నారెడ్డి, ఎంపీటీసీ రాములు, టీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు ధశరథ రెడ్డి, నాయకులు జా జాల జగన్ రావు, జేడీ సుమన్, నేమూరి నరేష్, పుప్పాల నర్సయ్య, రాంరెడ్డి, ప్రదీప్, సురేష్ రెడ్డి, తుకారాం, రాజన్న, శ్రీనివాస్, సున్నం సత్యం, గణేష్, జిల్లాల పవన్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, విండో చైర్మన్లు పాల్గొన్నారు.