జగిత్యాల : ధర్మం. అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ( Role Model ) నిలువాలని అదనపు కలెక్టర్ బి. ఎస్.లత (B.S. Latha) అన్నారు. వాసవీ మాత జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ( Vasavi Matha Jayanthi ) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రవికుమార్ , వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంఘ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
పల్లకిని మోసిన ఎమ్మెల్యే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని పల్లకిని మోసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షుడు నవీన్, ప్రధాన కార్యదర్శి బోడ్ల జగదీష్, కోశాధికారి శ్రీనివాస్ ఆలయ ఛైర్మెన్ రాజేందర్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్, అరవింద్, సంతోష్, సునీల్, వైశ్య సంఘం సభ్యులు, వాసవి మాత భక్తులు,
తదితరులు పాల్గొన్నారు.