Godavarikhani | కోల్ సిటీ, జూన్ 15: రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలిగా బంక కళావతి, కార్యదర్శిగా కజంపురం జయప్రద, కోశాధికారిగా పడ్లకొండ ఉమారాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థాపన అధికారిగా మాజీ డిస్ట్రిక్ గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి నూతన పీఎస్టి లచే ప్రమాణ స్వకారం చేయించారు.
మాజీ డిస్టిక్ గవర్నర్ మినేష్ నారాయణన్ టండన్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో 55 యేళ్ల ప్రస్థానంతో క్లబ్ కు ప్రపంచ గుర్తింపు లభించడం సభ్యుల అంకితభావం, క్రమశిక్షణే కారణమన్నారు. లయనిజంలో అనుభవజ్ఞులైన మహిళలకు రెండవసారి సమాజ సేవ చేసేందుకు అవకాశం దక్కిందనీ, గత మహిళా పీఎస్ టీ లను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
లయన్ రామస్వామి, తానిపర్తి గోపాల్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ లయన్ సభ్యులు ఎస్. సత్యనారాయణ, గంగాధర్, శరత్ బాబు, రాజేందర్, పీ. మల్లికార్జున్, రమాపతి రావు, రవీంద్రచారి, ఎల్లప్ప, సారయ్య, రాజేంద్రకుమార్, మనోజ్ కుమార్, జోన్ చైర్ పర్సన్ తానిపర్తి విజయలక్ష్మీ, ఎస్ లావణ్య, తిలక్ చక్రవర్తి, మనీషా అగర్వాల్, వివిధ ఏరియాల క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.