కొత్తపల్లి, ఆగస్టు 29: కరీంనగర్లోని మానేరు పాఠశాలలో మంగళవారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురసరించుకొని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని క్రీడాకారులందరికీ ధ్యాన్చంద్ స్ఫూర్తి అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒకరూ ఆదర్శంగా తీసుకొని దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థులకు రన్నింగ్, కబడ్డీ, చెస్, క్యారం, మ్యూజికల్ చైర్, తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడారు. ట్రస్మా రాష్ట్ర బాధ్యులు అరకాల రాంచంద్రారెడ్డి, ఎస్ఎన్రెడ్డి, పాఠశాల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ సరితారెడ్డి, పీఈటీలు మహేందర్, తిరుపతి, మహేందర్, జయంతి, జహేదా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు, సమన్వయకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేసి, క్రీడా పోటీలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, అనూకర్రావు, వినోద్రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాల్ రితేష్ మెహత, తదితరులు పాల్గొన్నారు.
భగత్నగర్లోని సిద్ధార్థ పాఠశాలలో ధ్యాన్చంద్ చిత్రపటానికి అకడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జ్ఞాపికలతో సత్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 29: స్థానిక మెహర్నగర్లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వేర్వేరుగా క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీప్రకాశ్రావు, వైస్ చైర్మన్ పృథ్వీరావు, ప్రిన్సిపాల్ ప్రశాంత్ పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్ స్కూల్లో ధ్యాన్చంద్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ సరిత పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ధ్యాన్చంద్ దేశానికి చేసిన సేవలు, ఆయన గొప్పతనాన్ని వివరించారు. క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. విద్యార్థులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ఫిజికల్ డైరెక్టర్ ఎర్రం హరీశ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 29: నగునూర్లోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సమత, ఏసీవో డాక్టర్ ఎస్ సుష్మా, స్టాఫ్ సెక్రటరీ రోజారమణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ లావణ్య, గ్రంథాలయాధికారి మోహన్ రావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.