శంకరపట్నం, డిసెంబర్ 2: మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నాబార్డు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తమ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. తమ కుటుంబాల్లో పెద్దలు ఆర్థిక మోసాలకు గురి కాకుండా విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్మార్ట్ఫోన్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ భద్రత, డిజిటల్ సేవలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే హౌసింగ్, ఓవర్సీస్, మార్ట్గేజ్, ఫౌల్ట్రీ తదితర లోన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. పీఎంఈజీపీ కింద సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. టీజీబీ, ఆర్బీఐ, నాబార్డ్, గాల్, అలాగే పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై వంటి బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధి రేణుక, , బ్యాంక్ సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.