జగిత్యాల రూరల్ /మల్యాల, మే 9 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్టపైకి రానున్నారు. అంజన్న ఆలయంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్తో కలిసి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వివరాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.