మల్యాల, జనవరి 2: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికి ప్రధానాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, తదితరులున్నారు.
నేడు స్పీకర్ పోచారం రాక.. ఏర్పాట్ల పరిశీలన
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానానికి మంగళవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. స్పీకర్ ఉదయం 10 గంటల వరకు ఆలయానికి చేరుకోనున్నారని, ఆల య అధికారులు, పాలకమండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామితో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం మల్యాల, కొడిమ్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు స్పీకర్కు ఘనస్వాగతం పలుకలాని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, ముత్యంపేట-కొండగట్టు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి , సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పోతారం సహకార సంఘం అధ్యక్షుడు అయిల్నేని సాగర్రావు, మార్కెట కమిటీ వైస్ చైర్మన్ ఆసం శివకుమార్, అంజన్న ఆలయ పాలకమండలి సభ్యులు పోచమ్మల ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు కోటేశ్వర్రావుతోపాటు తదితరులున్నారు.