బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్, డిసెంబర్ 4: జగిత్యాలలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలకు రానున్న నేపథ్యంలో ఆదివారం బోయినపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రవిశంకర్ టీ(బీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు నేత లు, ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
అందుకు నాయకులు కార్యకర్తలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి సీఎం సభపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. బోయినపల్లి మండలం నుం చి 5వేల మందిని సీఎం సభకు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మండల టీ(బీ)ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేటలో పార్టీ శ్రేణులతో టీ (బీ)ఆర్ఎస్ మం డలాధ్యక్షుడు వర్స కృష్ణహరి సమావేశమయ్యారు. జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు మండలంలోని గ్రామాల నుంచి వచ్చే జనసమీకరణ వివరాలపై చర్చించారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్గౌడ్, పీఏసీఎస్ చైర్మ న్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు గుళ్లపల్లి నర్సింహారెడ్డి, నమిలికొండ శ్రీనివాస్, రాధారపు శంకర్, పిల్లి కిషన్, నంది కిషన్, పందిళ్ల పరశురాములు, మజీద్, బాల్రెడ్డి ఉన్నారు.
ముస్తాబాద్ మండలం గూడెంలో కార్యకర్తలతో టీ (బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మం డల రెడ్డి సంఘం అధ్యక్షుడు సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ తన్నీరు గౌతంరావు, సెస్ మాజీ చైర్మన్ ఏనుగు విజయరామారావు, మాజీ సర్పంచ్ చీటి వెంకటనర్సింగరావు, మాజీ జడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్రావు, ఎల్లం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.