జగిత్యాల/ జగిత్యాల కలెక్టరేట్, మార్చి 29: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవా ది హనుమంతరావు (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం జగిత్యాల హౌసింగ్ బోర్డుకాలనీలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తన సేవలతో మంచి గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు కొడుకులు సంజయ్, సందీప్కుమార్, కూతురు రజిత ఉన్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వా త మోతె శ్మశానవాటిక (శంకర్ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకుముందు హనుమంతరావు భౌతిక కాయానికి పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ని వాళులర్పించారు. సంజయ్ను జడ్పీ చైర్పర్స న్ దావ వసంత దంపతులు, వేదపండితులు నంబివేణుగోపాలచార్య కౌశిక, తిగుళ్ల విష్ణుశర్మ, పురప్రముఖులు పరామర్శించారు. రా త్రి 8గంటల ప్రాంతంలో భౌతికకాయం వద్ద బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నివాళులర్పించారు. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. హనుమంతరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సంతాపాన్ని ప్రకటించారు.
హనుమంతరావు మృతికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమని పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంతాపం ప్రకటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.