సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 4: పోచమ్మతల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కొనియాడారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరెపల్లిలో ఆదివారం పోచమ్మతల్లి ఆలయం పున: నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. మనోహర్రెడ్డికి విజేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఆలయ నిర్మాణానికి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మించాలని పలువురు కోరడంతో సానుకూలంగా స్పందించారు.
ఇక్కడ ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత-రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్చందర్రావు, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్గౌడ్, సుల్తానాబాద్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కౌన్సిలర్లు గుర్రాల శ్రీనివాస్, తిరుపతి, గోపి, సంపత్, బొంకూరి ఐలయ్య, గుర్రాల మల్లేశం, రంగరెడ్డి, పారుపెల్లి గుణపతి, తాళ్లపల్లి మనోజ్గౌడ్, ముత్యం రమేశ్గౌడ్, దయాకర్ ఉన్నారు.
రేగడిమద్దికుంటకు చెందిన నోముల కరుణాకర్రెడ్డి అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలో హెచ్పీ పెట్రోల్ పంప్, ఎస్వీ ఫిల్లింగ్ స్టేషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత నల్ల మనోహర్రెడ్డి, సర్పంచ్ గడ్డం వసంత-మోహన్రెడ్డి, విండో చైర్మన్ గడ్డం మహిపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అన్నెడి మహిపాల్రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్, నాయకులు రమేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రాజకొంరయ్య, నిశాంత్, నాగరాజు, కుమార్, సదయ్య ఉన్నారు.
పెద్దపల్లి టౌన్, డిసెంబర్ 4: పెద్దపల్లి 13వ వార్డులో సీడీఎఫ్ నిధుల ద్వారా మంజూరైన దాదాపు రూ. ఐదు లక్షలతో బ్రాహ్మ ణ సంఘం అదనపు గది నిర్మాణానికి భూమి పూజ నిర్వహిం చారు. ఈ నెల 9వ తేదీన హైద రాబాద్లో నిర్వహించనున్న బ్రాహ్మణ గర్జన పోస్టర్లు, కర పత్రాలను ఆవిష్కరించారు ఇక్కడ చైర్పర్సన్ మమతా రెడ్డి, వైస్ చైర్పర్సన్ నజ్మీనా సుల్తానా బేగం-మొబిన్, కౌన్సిలర్ పాగాల సోని-శ్రీకాంత్, బ్రాహ్మణులు కిషన్ రావు, నాగేశ్వర్ రావు, ప్రభాకర్ రావు, లక్ష్మణ మూర్తి, వాసుదేవ రావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.