తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం తెలిసిందే. నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం, శాతవాహన యూనివర్సిటీ సంయుక్తంగా కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో ఈనెల 20న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన అవగాహన సదస్సు పోస్టర్ను మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఆవిష్కరించారు.
ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ నియామకాలను సీఎం కేసీఆర్ ప్రకటించారని.. నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులను నమ్మకుండా పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా తెలంగాణ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించడంపై సంఘం అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మతు నాయక్, ఇతర గ్రూప్ వన్ అధికారులను మంత్రి అభినందించారు.