తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పెద్దపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని చాటేలా పండుగలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని సూచించారు.
– కార్పొరేషన్/ కలెక్టరేట్, మే 28
పెద్దపల్లి, మే28: జూన్ 2నుంచి 22 వతేదీ వరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని రా ష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీతా సత్యనారాయణతో కలిసి వేడుకల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఉమ్మడి పాలనలో సాగు, తాగునీరు, కరెంట్ లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇప్పుడు తాగు, సాగునీరు, నిరంతర కరెంట్ అందుతున్నదని చెప్పారు. ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయన్నారు.
నీటిపారుదల రంగంలో అనూహ్య ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. మన రైతులు పంజాబ్కు దీటుగా వరి సాగు చేస్తున్నారని తెలిపారు. సమైక్య పాలనలో నిర్వీర్యమైన ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతి జిల్లాలో వై ద్య కళాశాల, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ హబ్, బస్తీ,పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందుతున్నాయని చెప్పారు. కేసీఆర్ కిట్, కంటి వెలుగు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలు ప్రగతి ప థంలో పయనిస్తున్నా యన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మన పల్లెలకే అధికంగా వరించాయ ని, ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడంతో అద్భుత ఫలితా లు వచ్చాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మన ప్రగతిని నలుదికులా చాటేలా ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రతి మండల పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్నాహక సమావేశాలను రెండు రో జుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఎకడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా తెలంగాణ రా ష్ట్రం సాధించిన విజయాలు ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ వైభవ్ గైక్వాడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు వెంకట మాధవరావు, వీరబ్రహ్మచారి, జిల్లా అధికారులు, మున్సిపల్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.