జగిత్యాల రూరల్, డిసెంబర్ 1: జిల్లా కేంద్రం లో ఈనెల 7న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యం లో ఏర్పాట్ల పరిశీలనకు గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత జగిత్యాలకు వచ్చా రు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మంత్రులు హరీశ్రావు, ఈశ్వర్, ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందిం చి స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభం, నూతన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, అనంతరం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం పార్టీ కార్యాలయం, కలెక్టరేట్, మెడికల్ కళాశాలను వారు పరిశీలించారు. అక్కడి నుండి బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుని ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, ఎమ్మె ల్సీ కవిత, ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందజేశారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పా ట్లు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూశర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మకరంద్ కలిసి మంత్రి హరీశ్ రావుకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భం గా జిల్లాకు వచ్చిన మంత్రి హరీశ్రావుకు పలువురు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, కౌశిక్ రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కుడా చైర్మన్ రామకృష్ణారావు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఈనెల 7న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సభా స్థలిని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్రావును టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్, కార్యదర్శి నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు, ప్రయోజనాల గురించి వారితో చర్చించగా, పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు, సాహెద్ బాబు, రవీందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.