కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 22: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం గణిత పితామహుడు, శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో గణిత బోధనకు సంబంధించిన ఎగ్జిబిషన్ నిర్వహించారు. గణితం ఎంత మాత్రం కఠినమైంది కాదని, ఇష్టంగా ప్రయత్నిస్తే సమస్యలను సులువుగా సాధించవచ్చని ఎంఈవో ఆరెపల్లి రాజయ్య పేర్కొన్నారు. శుక్రవారం గణిత దినోత్సవ వేడుకలను పెగడపల్లి హైస్కూల్లో ఘ నంగా నిర్వహించారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో రాజయ్య మాట్లాడారు. గణితం సకల శాస్త్రాలకు తల్లి వంటిదని, గణితంలో ప్రతిభ చూపిస్తే మిగత సబ్జెక్ట్లు సులభంగా నేర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్, హెచ్ఎం సత్యనారాయణరావు, గణిత ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, సౌధామిని తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. లక్ష్మీనర్సయ్య మాట్లాడారు. శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే గణితశాస్త్రంపై పట్టు సాధించి ఎందరో మన్ననలు పొంది, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి ఎంపిక కావడం అతడి గొప్పతనమని కొనియాడారు. ఎదుగుదలకు పేదరికం అడ్డుకాదని, దానికి రామానుజన్ జీవితమే ఒక ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమం లో రేల్ల సంజీవ్, ఆర్. రామకృష్ణ, కె. అర్జున్, రవీందరరావు, శ్రీ నివాస్, పి. మాధవి, కిరణ్మయి, సునీత, జి. రామకృష్ణ, అంజ య్య పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో గణిత నమూనాల ప్రదర్శన నిర్వహించగా పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్ ప్రారంభించారు. రామానుజన్కు ఇష్టమైన సంఖ్య అయిన 1729ని విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ అల్లెంకి రజిని, ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయులు రజియుద్దీన్, నాసియ, రమ్యశ్రీ, నవీన్, స్రవంతి పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని సాయి మణికంఠ మాడ్రన్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం గురించి, గణాంకాల పద్ధతుల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్కుమార్, ఎండీ జైన రమాదేవి పాల్గొన్నారు. ధర్మారం మండలం నంది మేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్ మాధవి లత అధ్వర్యంలో, ధర్మారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం పినుమల్ల ఛాయాదేవి అధ్వర్యంలో శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కమాన్పూర్, డిసెంబర్ 22: మండల కేంద్రంలోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో శుక్రవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎగ్జిబిషన్లో విద్యార్థులు వివిధ గణిత బోధనానికి సంబంధించిన నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో బోధకురాలు రాజమణి, కరస్పాండెంట్ చదువు వెంకటరెడ్డి, ఉపాధ్యాయురాళ్లు శారద, పద్మ, రుతువ్య, గౌతమి, సుమ పాల్గొన్నారు. అలాగే కంఫర్ట్ పాఠశాలలో విద్యార్థులు 1729 ఆకారంలో కూర్చొని రామనుజన్కు నివాళులర్పించారు. పాఠశాల హెచ్ఎం విజయ్కుమార్, కరస్పాండెంట్ సౌమ్య పాల్గొన్నారు.
జ్యోతినగర్, డిసెంబర్ 22: ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో దాదాపు వంద మంది విద్యార్థులు మ్యాథ్స్ ఈజీ అనే కాన్సెప్ట్పైన ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. గణితశాస్త్రంపై నృత్య, గీత ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మ్యాథ్స్ బోధించే ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్ బందారపు యాదగిరిగౌడ్, హెచ్ఎం తిరుపతిగౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ సన్మానించారు. రామగుండంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రంగోళి పోటీలు, గణిత కాన్సెప్ట్ ఎగ్జిబిషన్ ని ర్వహించారు. విద్యార్థులు ముగ్గుతో రామానుజన్ చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఇక్కడ ఉపాధ్యాయులు మనోహర్, జగదీశ్వర్, లక్ష్మీనారాయణ, అయేషా, అమీనా, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు అనిత, కిరణ్, కృష్ణ ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, డిసెంబర్ 22: పట్టణంలోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఎగ్జిబిషన్ను గోదావరిఖని వన్టౌన్ సీఐ ప్రమోద్రావు ప్రారంభించారు. ఇక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గాలి సునీత, స్వచ్ఛ ంద సంఘాల బాధ్యులు దయానంద్ గాంధీ, దాసరి అరుణ, ఉన్నారు. కృష్ణవేణి పాఠశాలలో మంజుల శ్రీనివాస్రెడ్డి రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి, జయంతి కేక్ కట్ చేశారు.
ఓదెల, డిసెంబర్ 22: పొత్కపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు గణితానికి సంబంధించిన మ్యాజిక్ ముగ్గులు వేశారు. అలాగే గణితంపై వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, గణిత ఉపాధ్యాయులు జైపాల్రెడ్డి, షాబానా బేగం, ఉపాధ్యాయులు సులోచనాదేవి, శ్రీనివాస్, రఘుపతి, అమృత కిషోర్, రవి, రవీందర్, శంకరమ్మ పాల్గొన్నారు.
ముత్తారం, డిసెంబర్ 22: మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గణితశాస్ర్తానికి సంబంధించిన మోడల్స్, చాట్స్ తయారుచేసి ప్ర దర్శించగా, బహుమతులు అందించారు. ఇక్కడ పాఠశాల ప్రత్యేక అధికారిణి సీహెచ్ కమల, గణితశాస్త్ర ఉపాధ్యాయినులు సంజీవరాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.