కార్పొరేషన్, అక్టోబర్ 1: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో గంట పాటు శ్రమదానం చేశారు. అంబేద్కర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బందితో కలిసి మేయర్ చీపురు పట్టి చెత్తను ఊడ్చి, స్టేడియం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. అనంతరం చుట్టు పరిసరాల్లో ఉన్న పిచ్చి మొకలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు.
ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికుల కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్లో మూడేళ్లుగా మెరుగైన ర్యాంక్ సాధిస్తోందన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రపుల్దేశాయ్, పారిశుధ్య కార్మికులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లలో స్వచ్ఛత ర్యాలీలు, శ్రమదానం
నగరంలోని 37వ డివిజన్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. డివిజన్లోని పలు వీధుల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అనిత, మహేశ్వరి, శ్రీకాంత్, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మూడో డివిజన్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, కార్మికులు, సీనియర్ సిటిజన్స్ రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం అవగాహన ర్యాలీ తీశారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఇన్స్పెక్టర్ నరోత్తమ్రెడ్డి, సీవో తిరుపతి, జవాన్ భాసర్, ఆర్పీ సభ్యులు వెన్నం ఉమ, మెంగని రజిత, లత, పద్మజ, పుష్ప, ప్రభాలత, బీఆర్ఎస్ నాయకులు సుల్తానా, బాలు, సాంబయ్య, గసికంటి శ్రావణ్, సంపతి అశోక్, మోదుంపల్లి ఆంజనేయులు, చిలుముల మహేందర్, రామంచ సతీశ్, కలీం, సాయి, లింగంపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గంజ్ హైసూల్లో, సమీప వీధుల్లో బీఆర్ఎస్ నాయకుడు సోహాన్సింగ్ ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. 59వ డివిజన్లో కార్పొరేటర్ గందె మాధవి ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న, జవాన్ వెంకటేశ్, ఆర్పీ బీర్ల కవిత, డివిజన్ ప్రజలు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్, అక్టోబర్ 1: జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్, డాక్టర్లు, సిబ్బంది శ్రమదానం చేశారు. దవాఖాన పరిసరాల్లో ఊడ్చి చెత్తను తొలగించారు.
చొప్పదండి, అక్టోబర్ 1: పట్టణంలోని తొగురుమామిడిపల్లె ఎస్సీ కాలనీలో జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు శ్రమదానం చేశారు. అనంతరం అవగాహన ర్యాలీ తీశారు. ప్రిన్సిపాల్ మంగతాయారు, కౌన్సిలర్ కొట్టె అశోక్, ఉపాధ్యాయులు టీఎమ్కే రాయుడు, ఎస్పీ అబ్దుల్ రహమాన్, కేటీ ప్రసాద్, మల్లికార్జున్, నాగేశ్వర్, ఎస్ రాధిక, ప్రియా కౌషిక్, ప్రమీల, మరియా తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, అక్టోబర్ 1: మల్కాపూర్ గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమదానం చేశారు. పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ తీశారు.
ముకరంపుర, అక్టోబర్ 1: ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగులు పరిసరాలను శుభ్రం చేశారు. ఎస్ఈ వీ గంగాధర్, డీఈలు చంద్రమౌళి, కాళిదాసు, గోపీకృష్ణ, ఎస్ఏవో రాజేశం, రాజేశం, సుధీర్కుమార్, అంజయ్య, శ్రీనివాస్, ఏవోలు రాజేంద్రప్రసాద్, అరవింద్, రఘుపతి, సునీత, నిర్మలారాణి, స్వప్న, మునీందర్, అనిల్, జనార్దన్, కే శీను, వెంకటనారాయణ, వెంకటేశ్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 1: మండలంలోని ఆయా గ్రామాల్లో స్వచ్ఛత అవగాహన ర్యాలీలు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఎంపీడీవో ఎన్ఆర్ మల్హోత్ర, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.