కార్పొరేషన్, ఏప్రిల్ 8: ‘తాగుబోతుల తెలంగాణ అని నాలుగుకోట్ల ప్రజలను అవమానించిన బండి సంజయ్ వెంటనే వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలి..లేదంటే భేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు డిమాండ్ చేశారు.
సంజయ్ సన్నిహితులకు కూడా తెలియని వాట్సాప్ నంబర్ పేపర్ లీక్ చేసి న ప్రశాంత్కు ఎలా తెలిసింది? ఆయన ని జంగా తప్పు చేయకుంటే పోలీసులకు ఫో న్ ఎందుకు ఇవ్వలేదు? లిక్కర్ ఆదాయం ఏ రాష్ర్టాల్లో ఎంత వస్తుందో తెలుసా? తెలంగాణ కోసం కనీసం కార్పొరేటర్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో నాలుగు జిల్లాలకు దేవుండ్ల పేరు పెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత సంజయ్కు లేదని విరుచుకుపడ్డారు. శనివారం కరీంనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. టెన్త్ పేపర్ లీకేజీలో ప్రధాన ముద్దాయిగా ఉన్న సంజయ్ పోలీసుల విచారణకు సహకరించకుండా పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మూర్ఖుడని ధ్వజమెత్తారు.
‘పొరపాటున ఎంపీగా గెలిచిన సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. తెలంగాణ ప్రజలు జాతిపితగా కీర్తిస్తున్న సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోం’ అని హెచ్చరించారు. ఆయన పిచ్చి ప్రేలాపనలు, తలాతోకలేకుండా అర్థంపర్థం లేకుండా మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన సీఎం కేసీఆర్పై ద్వేషంతో తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఆయనకు కనీస పరిజ్ఞానం ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లిక్కర్పై ఎంత ఆదాయం వస్తున్నది. తెలంగాణలో ఎంత వస్తుందో చెప్పాలని నిలదీశారు. అత్యధికంగా కర్ణాటకలో 22 శాతం, యూపీలో 21.8 శాతం, మధ్యప్రదేశ్లో 19.8 శాతం ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నది వాస్తవాం కాదా? అని ప్రశ్నించారు. ‘అంతకంటే తక్కువ ఆదాయం పొందుతున్న తెలంగాణ తాగుబోతుల రాష్ట్రం ఎట్లయితదో చెప్పాలి? అక్కడి ప్రభుత్వాలు ప్రజల్ని తాగుబోతులుగా మార్చారా? అని ప్రశ్నించారు.
టెన్త్ పరీక్షల విషయంలో లీక్ల జాతర అని మాట్లాడిన నువ్వు..ఆ తెల్లారే పేపర్ లీక్ కాలేదని పొంతన లేకుండా ఎలా మాట్లాడుతారని నిలదీశారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేసేందుకే లీకేజీల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ఇప్పటికే లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో లక్ష ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉ ద్యోగాలు భర్తీ చేస్తుంటే బండి సంజయ్ మాత్రం యువతను తప్పుదారి పట్టించే లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పాలన్నారు. మన కలెక్టరేట్ల లాగా కూడా అక్కడ సచివాలయాలు లేవని ఎద్దేవా చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే ఆ పార్టీ విధానం అని విమర్శించారు. ఇప్పటికై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ స మావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీ నివాస్, బండారి వేణు, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, వాల రమణారావు, గందె మాధవి, నేతికుంట యాదయ్య, బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.