ఇన్నాళ్లు గుంతలమయమైన మన్నెంపల్లి- ఇందిరానగర్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. ఎమ్మెల్యే రసమయి కృషితో మూడు కిలోమీటర్ల రోడ్డుకు ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేసింది. రెండురోజుల క్రితం ప్రారంభమైన పనులు చకచకా సాగుతున్నాయి.
తిమ్మాపూర్ రూరల్, జనవరి 20: మన్నెంపల్లి గ్రామానికి రాజీవ్ రహదారి నుంచి ఇందిరానగర్ గ్రామం వద్ద ఆర్ అండ్ బీ రోడ్డు ఉన్నది. గత వానకాలంలో కురిసిన వర్షాలకు గుంతలమయమైంది. స్థానిక ప్రజాప్రతినిథులు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వానికి నివేదికలు పంపి, రూ.45లక్షలు మంజూరు చేయించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పనులు ప్రారంభం అవగా, త్వరలోనే పూర్తి పనులు ముగియనున్నాయి. ఈ రోడ్డు గుండా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కేవలం మన్నెంపల్లి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల రైతులు కూడా ఈ రోడ్డు గుండా వెళ్తుంటారు. అయితే అడుగడుగునా గుంతలు పడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకేలకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పొన్నం అనిల్గౌడ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ రోడ్లకు మరమ్మతు
తిమ్మాపూర్ మండలంతో పాటూ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు వెళ్లే పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయిస్తున్నాం. చాలా చోట్ల పనులు కూడా పూర్తయాయ్యియి. కొన్ని చోట్ల నడుస్తున్నాయి. ఇప్పటికే అల్గునూర్ నుంచి తిమ్మాపూర్ వరకు కలిపే రోడ్డు పూర్తయింది. ప్రజలకు ఎక్కడా సమస్య లేకుండా పనులు పూర్తిచేస్తాం.
-రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే