జగిత్యాల రూరల్/ జగిత్యాల టౌన్/ సారంగాపూర్, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ఇందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. సర్కారు పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ మహత్తరమైనదిగా అభివర్ణించారు. 22 లక్షలతో ఆధునీకరించిన జగిత్యాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 21 లక్షలతో అన్ని హంగులు సమకూర్చిన జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి మండల పరిషత్ స్కూళ్లను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అలాగే సారంగాపూర్లో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 39 మందికి 10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు.
‘మన ఊరు-మనబడి’ కింద స్కూళ్లల్లో అధునాతన డెస్క్లు, కరెంట్ సౌకర్యం, గ్రీన్బోర్డులు, భవనాలు, తరగతి గదులకు పెయింటింగ్, మరుగుదొడ్లు, వంటగదుల ఆధునీకరణ, ప్రహరీ, స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం తదితర 12 పనులను చేపడుతున్నామని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలోని 70 పాఠశాలలను 28కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సంగంపల్లిలో 174 మందికి వృద్ధాప్య, 60 మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
238 మందికి రైతుబంధు ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. 29 మంది లబ్ధిదారులకు 600 గొర్రెలు, 20 మందికి కల్యాణలక్ష్మి చెకులను అందజేసినట్లు తెలిపారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్ మల్లవ్వామల్లయ్య, నాయకులు రాజేశ్వర రెడ్డి, అంజన్న, మోహన్రెడ్డి, గంగాధర్, తిరుపతి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో రవి బాబు, ఎంఈవో గాయత్రి, డీఈ మిలింద్, ఏఈ రాజమల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.