హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్న కొడుకును ఇంటికి తీసుకువస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఏడుగురితో ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ వెనుకనుంచి ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించగా, కొడుకుతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులో ప్రమాదం జరగగా, మృతుని స్వగ్రామమైన రాజన్న సిరిసిల్లజిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ రూరల్, అగస్టు 4: కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులోని మైనార్టీ గు రుకుల పాఠశాలలోని కొడుకును తీసుకు వస్తున్న తండ్రి మృత్యు ఒడికి చేరాడు. గురువారం రాత్రి మొగ్దుంపూర్ శివారులో టాటా ఏస్ను బూడిద లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందడంతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామా నికి చెందిన వొల్లాల అంజయ్యగౌడ్ (42) కొడు కు రుత్వీక్ కరీంనగర్ రూరల్ మండ లంలోని మొగ్దుంపూర్ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతు న్నాడు. జ్వరంతో బాధపడుతున్న రుత్వీక్ను తీసుకొచ్చేందుకు తండ్రి అంజయ్య గౌడ్ గురు వారం సాయంత్రం వెళ్లాడు. తిరుగు ప్రయా ణం లో టాటా ఏస్ వాహనంలో వస్తుండగా మొ గ్దుంపూర్ శివారులో టాటా ఏస్ వాహనాన్ని వెను క నుంచి బూడిద లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజయ్యగౌడ్ మర ణించాడు. కొడుకు రుత్వీక్ తలకు గాయమైంది. ఈ ప్రమా దంలో మరో నలుగురు గాయపడ్డారు. వీరిని కరీంనగర్ దవాఖానకు తరలించారు.