ధర్మపురి, జూలై 8: ఉచిత కుట్టుమిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నైపు ణ్యం సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ సూచించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహ సంస్కృతాం ధ్ర కళాశాలలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మి క సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారి కుటుంబాల మహిళలకు 90 రోజుల కు ట్టుశిక్షణ, నిర్మాణ రంగ వృత్తుల నైపుణ్య అభివృద్ధి కోసం 15 రోజుల ఉచి త శిక్షణ కేంద్రాన్ని మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. న్యాక్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలో కుట్టుమిషన్ శిక్ష ణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. శిక్షణ తీసుకుంటున్న మహిళలకు రోజుకు రూ.300 అందజేస్తూ, ఒక పూట భోజన సౌక ర్యం కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు.
ఈ ఉచిత శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమనీ, అందుకు ప్రతీ ఒక్కరూ కు ట్టుమిషన్ శిక్షణ పొందాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ సంక్షేమశాఖ, న్యాక్ ఆధ్వర్యంలో దాదాపు 3 వేల మంది మహిళలు శిక్షణ పొంది కుట్టుమిషన్లు కూడా పొందారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 20వేల మందికి లేబర్ కార్డులు ఇప్పించామన్నారు. లేబర్ కార్డు లేని భనవనిర్మాణ కార్మికులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎ ల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమా ర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు అనంతుల విజయలక్ష్మి, వొడ్నాల ఉమాలక్ష్మి, సయ్యద్ యూనుస్, అయ్యోరి వేణు, బం డారి అశోక్, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్కుమా ర్, ఇన్స్ట్రక్టర్లు శిల్ప, రాజమొగిలి, సునీల్కుమార్ తదితరులున్నారు.