సమస్యల్లేకుండా చూడాలన్నదే లక్ష్యం
మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం మండలంలో విస్తృత పర్యటన
పద్మశాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
30 మందికి కుట్టు మిషన్లు పంపిణీ
ధర్మారం, ఫిబ్రవరి 5: ప్రజా సేవకే ఈ జీవి తం అంకితమని, ప్రజల దీవెనలతో పదవిలోకి వచ్చిన తాను వారికి ఏ సమస్యల్లేకుండా చూడాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. లంబాడి తండా (బీ)లో సర్పంచ్ భూక్యా చంద్రా నాయక్ కూతురు వివాహానికి, ఎర్రగుంటపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ధర్మారానికి చెందిన కోరుకంటి స్వామి కూతురు వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎర్రగుంటపల్లిలో సమ్మక్క, సారలమ్మ గద్దెలను సందర్శించి, టీఆర్ఎస్ కార్యకర్తల సమావే శం నిర్వహించారు. అనంతరం ధర్మారంలో రూ.10 లక్షల వ్యయంతో పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక ఖిలావనపర్తిలో ప్రభుత్వ భూమిని కాస్తు చేసుకుంటున్న గ్రామస్తులతో ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశమై, ధర్మారంలోని రై తు వేదికలో 30 మంది ఎస్సీ మహిళలకు మంత్రి ఈశ్వర్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎర్రగుంటపల్లిలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నానని చెప్పారు. ఇంకా మంత్రి హోదాలో ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఆస్కారం ఏర్పడిందని, సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, గ్రామంలో ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద సీసీ రోడ్డు నిర్మించామని, ఇంకా భక్తుల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయిస్తామని, ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, ఎస్సీ, యాదవులకు కమ్యూనిటీ భవన నిర్మాణాలకు మంజూరు చేస్తామని గ్రామస్తులకు, పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన ఇంజపురి రాజయ్య కూతురు భర్త మరణించగా, ఆమెకు దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, ఆమె పిల్లలకు మంచి విద్య అందిస్తామని చెప్పా రు. అనంతరం ధర్మారం మార్కెట్ యార్డులో ఖిలావనపర్తి శివారులో ప్రభుత్వ భూములను కాస్తు చేస్తున్న గ్రామస్తులతో సమావేశమై మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. గత కొన్నేళ్ల నుంచి పంటలు పండించుకుంటున్నామని, పట్టాలు లేక అభద్రతతో ఉన్నామని గ్రామస్తులు ఏకరువు పెట్టగా, సర్వే చేయించి పట్టాలు అందిస్తామని చెప్పారు.
కాగా, ఈ విషయమై కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామానికి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని, వారితో ఏమీ కాదని తిప్పి పంపించాలని సూచించారు. కాగా, ధర్మారంలోని ఒకటో వార్డులో భగీరథ నీరందించాలని వార్డుకు చెందిన పలువురు స్థానిక మార్కెట్ యార్డులో మంత్రికి వినతి పత్రం అందజేయగా, మంత్రి స్పందించారు. సంబంధిత డీఈఈతో ఫోన్లో మాట్లాడి ఆ వార్డులో ప్రత్యేకంగా 20 వేల లీటర్ల ట్యాంక్ నిర్మించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి, ఎంపీడీవో జయశీల, నంది మేడారం, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్లు ము త్యా ల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి,వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ధర్మారం ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధ ర్, పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు, ధర్మారం, ఎర్రగుంటపల్లి, ఖిలావనపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు బాస తిరుపతి రావు, ఆవుల మల్లేశం, మో తె అంజయ్య, నాయకులు కొండయ్య, కనకయ్య, కీసర స్వామి, రాజలింగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ మోహన్రెడ్డి, ధర్మారం పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్, గౌరవ అ ధ్యక్షుడు దేవయ్య, నాయకులు శ్రీనివాస్, రాజు, సత్యనారాయణ, రాజయ్య, విఠల్, ఎర్రగుంటపల్లి సమ్మక్క సారలమ్మ అధ్యక్షుడు లచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు సుమన్, చొక్కారెడ్డి, గంగారెడ్డి, వెంకటేశ్, మాల్లారెడ్డి ఉన్నారు.