ధర్మారం, అక్టోబర్ 21: గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండలంలోని నర్సింగాపూర్కు చెందిన కుంటా ల నర్సయ్య గులాబీ గూటికి చేరారు. శనివారం కరీంనగర్లోని మంత్రి కొప్పుల కార్యాలయంలో బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయనకు అమాత్యుడు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 2018కు ముందు నర్సయ్య బీజేపీలో చురుగ్గా పనిచేశారు. 2014లో ఆయన సతీమణి పత్తిపాక ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం నర్సయ్య 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా బరి లో నిలిచారు.
ఆయనకు కేటాయించిన ట్రకు గు ర్తు కారును పోలి ఉండడంతో 13,114 ఓట్లు వచ్చాయి. అలాగే ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేయగా 18,219 ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరలేదు. ఈ క్రమంలో మంత్రి ఈశ్వర్ పిలుపు మేరకు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కొప్పుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నర్సింగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.