ఏఎంసీ చైర్మన్గా కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
అమాత్యుడు కొప్పుల చొరవతో పదవి
ధర్మారం, మే 25: పార్టీ కోసం కష్టపడడమే గాకుండా రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఉన్న విధేయతతోనే మండలంలోని కొత్తపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి వరించింది. ఆయన వివిధ పార్టీల్లో పనిచేసి పలు పదవులను చేపట్టాడు. టీఆర్ఎస్లో చేరిన అనతికాలంలోనే మంత్రి ఈశ్వర్ ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదిగారు. ఇది వరకు ఆర్బీఎస్ బాధ్యుడిగా నియామకం కాగా ప్రస్తుతం ధర్మారం, ఎలిగేడు మండలాల్లో విస్తరించి ఉన్న ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి దక్కింది. ఈ మేరకు మంత్రి ఈశ్వర్ను కలిసిన బుచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. బుచ్చిరెడ్డి గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. 1988లో కొత్తపల్లి సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 వరకు బాధ్యతలు చేపట్టారు.
అనంతరం 1994 నుంచి 2002 వరకు గ్రామ వీఎస్ఎస్ చైర్మన్గా పని చేశారు. 2006లో బొమ్మారెడ్డిపల్లి ఎంపీటీసీగా ఎన్నికై 2013 వరకు పనిచేశారు. బుచ్చిరెడ్డి రాజకీయాల్లో క్రీయాశీలంగా ఉన్న ఆయన తన సతీమ ణి కోమటిరెడ్డి లలితను కూడా సర్పంచ్ పదవులకు పోటీ చేయించారు. 2001లో జరిగిన స ర్పంచ్ ఎన్నికల్లో లలిత కొత్తపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2019లో సర్పంచ్ పదవికి పోటీ చేసి రెండోసారి ఎన్నికై ప్రస్తుతం ఆ పదవి లో కొనసాగుతున్నారు. కాగా చివరగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన బుచ్చిరెడ్డి 2016లో అప్పడు చీఫ్విప్గా ఉన్న ప్రస్తుత మంత్రి కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈశ్వర్కు విధేయుడిగా ఉంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీలో ముఖ్యభూమిక పోషిస్తున్నా రు. దీంతో బుచ్చిరెడ్డి కృషిని గుర్తించిన మంత్రి ఈశ్వర్ ఆయనకు 2020లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడిగా అవకాశమిచ్చారు.
రెండున్నర సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పర్యటనలు, పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ మంత్రికి ఎంతో విధేయుడిగా ఉన్నారు. దీంతో మంత్రి సిఫారసుతో బుచ్చిరెడ్డికి నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. దీంతో బుచ్చిరెడ్డి ఇటీవల మంత్రి ఈశ్వర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి తిరిగి రాగానే బుచ్చిరెడ్డితోపాటు పాలకవర్గం ప్రమాణ స్వీ కారం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.