హుజూరాబాద్రూరల్,డిసెంబర్ 2: ‘హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకో..వందల కోట్లు అక్రమంగా సంపాదించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించబోం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం హూజూ రా బాద్ మండలం తుమ్మనపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. భూ సమస్యల పరి ష్కారం కోసం తెచ్చి ధరణి పోర్టల్పై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నా రని మం డిపడ్డారు. అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈటలను పార్టీ నుంచి పంపించివేశారన్నారు.
సానుభూతితో గెలిచిన ఆయన హుజూరాబాద్ ప్రజలకు చేసిందేంలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధిచెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశా రు. సమావేశంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, సర్పంచ్లు ప్రతాప్రెడ్డి, ఎల్లయ్య, ఎంపీటీసీ రాజేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు.