రాంనగర్, మార్చి 15: ఆకస్మిక గుండెపోట్లతో సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు సీపీఆర్సీపీఆర్ (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య)పై శిక్షణ ఇస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో మెడికవర్ దవాఖాన సహకారంతో బుధవారం ట్రాఫిక్ సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మాట్లాడుతూ హార్ట్ అరెస్ట్యిన సందర్భాల్లో సీపీఆర్ ద్వారా గుండెకు రక్తప్రసరణ, నోటిద్వారా ఆక్సిజన్ అందించడంతో బాధితులను రక్షించే అవకాశం ఉంటుందన్నారు.
మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైద్యులు అక్ష య్, హర్షిత సీపీఆర్ చేసే తీరును వివరించారు. అనంతరం వైద్యులు సీపీ సుబ్బారా యుడుతోపాటు ఉన్నతాధికారులు, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులతో సీపీఆర్ విధానాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు బీ విజయ్కుమార్, సీ ప్రతాప్, మెడికవర్ దవాఖాన అడ్మినిస్ట్రేటివ్ అధికారి గుర్రం కిరణ్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునారావు పాల్గొన్నారు.