హుజూరాబాద్ టౌన్, మే19: ఎక్సైజ్ శాఖ కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ విజయ భాసర్రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మణెమ్మ ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సరిల్ పరిధిలో గల 17 మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ వీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గురువారం విసృ్తత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో మద్యం దుకాణాల్లో ఇదివరకే నిల్వ ఉంచిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించడానికి ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉన్న మద్యం వివరాలను అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా సీఐ వీ చంద్రమోహన్ మాట్లాడారు. సేకరించిన మద్యం నిల్వలు, కొత్తగా పెరిగిన మద్యం ధరలకు సంబంధించిన డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని మద్యం దుకాణాల్లో పెరిగిన మద్యం ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, ఎమ్మార్పీ కన్నా ఎకువ ధరకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ రమ్య, హెడ్ కానిస్టేబుళ్లు ముకుందరెడ్డి, మోహసిన్, కానిస్టేబుళ్లు రమేశ్, కుమార్యాదవ్, కమలాకర్, నవీన్కుమార్, చిరంజీవి, ధనలక్ష్మి, శృతి, స్రవంతి, సంతోష్కుమార్, కార్తీక్, చంటి తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపుల తనిఖీ
జమ్మికుంట, మే19: మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు గురువారం మున్సిపల్ పరిధిలోని 8 మద్యం దుకాణాల్లో స్టాకును పరిశీలించారు. నిర్వాహకుల సమక్షంలో మద్యం నిల్వలను లెక్కించి, రికార్డు చేశారు. క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులు, స్టాకు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఉదయం నుంచే నాలుగు బృందాలుగా ఏర్పడి, ఆయా షాపుల్లో మద్యం నిల్వలను గుర్తించామని తెలిపారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు షాపుల్లో ఉన్న నిల్వలకు పెరిగిన ధరలు నిర్ణయిస్తామని, నిర్ణయించిన ధరల ప్రకారం ప్రభుత్వానికి నిర్వాహకులు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నేటి నుంచి పెరిగిన ధరలతోనే క్రయవిక్రయాలు సాగుతాయని తెలిపారు. స్టాకుల్లో తేడాలుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే మద్యం షాపుల నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఇక్కడ ఎస్ఐ, సిబ్బంది తదితరులు ఉన్నారు.