కొత్తపల్లి, అక్టోబర్ 4: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫలితాల్లో జాతీయ స్థాయిలో కొత్తపల్లి మున్సిపాలిటీ మొదటి ర్యాంకు సాధించగా, మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీఐ దాశరథి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో చైర్మన్, కమిషనర్ను శాలువాలతో సత్కరించి జ్ఞాపికతోపాటు క్లీన్సిటీ అవార్డును ప్రధానం చేశారు.
కీపిటప్.. బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. కొత్తపల్లి మున్సిపల్కు ప్రోత్సాహకంగా శానిటేషన్, వైకుంఠధామం నిర్వహణ కోసం 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ అరవింద్కుమార్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రమేశ్ పాల్గొన్నారు.