చొప్పదండి, అక్టోబర్ 2: గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గాంధీజీ శాంతియుత పద్ధతిలో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, జహీర్, కొత్తూరి నరేశ్, లక్ష్మణ్బాబు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 2: గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 2: దుర్శేడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు పూల మాలలు వేసి, నివాళులర్పించారు. వార్డు సభ్యులు, కారోబార్ మురళి, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య పాల్గొన్నారు. నగునూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీలు సాయిల వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్, గాంధీ పేపర్ మార్టు యజమాని జోగినిపల్లి రఘునందన్రావు, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, రాజు, బాబు, కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, నరహరిరావు తదితరులు పాల్గొన్నారు. చేగుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి సర్పంచ్ చామనపల్లి అరుణ, ఉపసర్పంచ్ గాండ్ల విజయ పూల మాలలు వేసి నివాళులర్పించారు. వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.