చిగురుమామిడి, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జ్వర సర్వేకు గ్రామస్తులు సహకరించి కరోనా నిర్మూలనకు తోడ్పడాలని ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీపీ కొత్తవినీతాశ్రీనివాస్రెడ్డి కోరారు. సుందరగిరి, బొమ్మనిపల్లిలో సోమవారం జ్వర సర్వేను పరిశీలించారు. ప్రతి జ్వరం, జలుబు లక్షణాలున్నట్లయితే వైద్య సిబ్బంది వద్ద మందులు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఉద్యమంలా ఇంటింటా జ్వర పీడితుల గుర్తింపు
ఇంటింటా జ్వర పీడితుల గుర్తింపు సర్వే సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉద్యమంలా కొనసాగింది. బల్దియా పరిధిలోని 30 వార్డుల్లో 24 బృందాల సభ్యులు 1617 ఇండ్లకు వెళ్లి 7546 మందికి ఫీవర్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా 25 ఇండ్లలో జ్వర పీడితులను గుర్తించి 25 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. 26 మందికి మొదటి డోస్, 34 మందికి సెకండ్ డోస్ కరోనా టీకాలను వేసినట్లు హెచ్ఈవో వెంకటేశం, పీహెచ్ఎన్ హెల్త్ సూపర్వైజర్ నిర్మలాజ్యోతి తెలిపారు. కౌన్సిలర్లు, హెల్త్ అసిస్టెంట్లు ఏ పద్మ, వసంత, సౌందర్య, వజ్ర, వనిత, రేణుక, శోభ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న జ్వర సర్వే
వావిలాల పీహెచ్సీ వైద్యుడు రఘపతి ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సోమవారం జ్వర సర్వే చేశారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తులు, గ్రామ కార్యదర్శులు 1748 ఇండ్లలో 7516 మందికి వైద్య పరీక్షలు చేశారు. 30 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి మందుల కిట్లను పంపిణీ చేశారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
లక్ష్మీపూర్(వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబానీ ఆధ్వర్యంలో సోమవారం 87 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. రంగపేట, జగ్గయ్యపల్లి, లింగాపూర్ గ్రామాల్లో 103 మందికి మొదట, రెండో డోస్, 15-18 ఏండ్లు ఉన్న ఐదుగురికి మొదటి డోస్, ఫ్రంట్లైన్ వారియర్స్ ఇద్దరికి బూస్టర్ డోస్తో కలిపి మొత్తం 110 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఇంటింటి సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారికి మందులు అందజేశామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా జ్వర సర్వే
ఇల్లందకుంట పీహెచ్సీ వైద్యురాలు జ్యోత్న ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సోమవారం 1768 ఇండ్లల్లో సర్వే చేయగా 27 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. వారికి మందులు అందజేసి, కరోనాపై అవగహన కల్పించారు. ఇక్కడ వైద్యురాలు శ్రీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్రెడ్డి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీసీలు ఉన్నారు.