టీఆర్ఎస్వీ హుజూరాబాద్ డివిజన్ నాయకుడు భాషబోయిన ప్రవీణ్యాదవ్ కుటుంబ పరిస్థితిని చూసి హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం సాయంత్రం పెద్దపాపయ్యపల్లిలోని ప్రవీణ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి విజయ, భార్య రమ్యను పలుకరించారు. ఏడాది వయసున్న ప్రవీణ్ కొడుకును ఎత్తుకుని చలించిపోయారు. ప్రవీణ్ ఇంట్లోనే విలేకరుల సమావేశం నిర్వహించి ఆ కుటుంబ పరిస్థితిని వివరించారు. ప్రవీణ్ తన ప్రతిభతో వారధి ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం సంపాదించుకుంటే.. తానే పెట్టించానని ఈటల చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఉద్యమకారుడైన ప్రవీణ్, అతని తల్లి విజయ ప్రతి ఎన్నికలో ఈటల గెలుపుకోసం పనిచేశారని, అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి ప్రవీణ్పై అక్రమ కేసు పెట్టి పోలీసులతో కొట్టించారని ధ్వజమెత్తారు. దెబ్బలతోనే అనారోగ్యం పాలై మృతి చెందితే గుండెపోటుతో మృతి చెందాడని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలోనే ప్రవీణ్ తల్లి, భార్య కన్నీళ్లు పెట్టుకోగా వారిని ఓదార్చారు. ప్రెస్మీట్ అనంతరం తిరిగివస్తూ మరోసారి భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టారు.
ప్రవీణ్ ఎలా చనిపోయాడోనీ అంతరాత్మకు తెలుసు..
కేసీఆర్ నాయకత్వంలో మేమంతా ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నం. ఈటల రాజేందర్లా చీకటి రాజకీయాలు చేయడం మాకు తెలియదు. ప్రవీణ్ కుటుంబానికి ద్రోహం చేసి, ఇప్పుడు తానే ఆ కుటుంబాన్ని ఆదుకున్నానని చెప్తున్నడు. ప్రవీణ్ది టీఆర్ఎస్ కుటుంబమని రాజేందర్ ఒప్పుకోవడం సంతోషం. కానీ, ఒక్కసారి కూడా పరామర్శించిన పాపాన పోలేదు. ఆయన క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రవీణ్ కుటుంబాన్ని కనీసం ఓదార్చలేదు. ఆయన తల్లిదండ్రులను, భార్యను పలుకరించలేదు. నీ వల్లనే ప్రవీణ్ చనిపోయాడని నీ అంతరాత్మకు తెలుసు. అందుకే నువ్వు దూరంగా ఉన్నవు.
ఇల్లందకుంట/ ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 30: ‘ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఉప ఎన్నికలో గెలిపించండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. ఆపద వస్తే ఆదుకుంటా’ అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి, బోగంపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రోడ్డు వెంట కలిసిన వృద్ధులు, రైతులు, యువకులను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరగా, గ్రామస్తులు సైతం శ్రీనివాస్కు జై కొట్టారు. కాగా, అంతకుముందు గెల్లు శ్రీనివాస్కు ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మర్రివానిపల్లిలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, మంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశాడని, పేదల కోసం సీఎం కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటీ కట్టించలేదన్నారు. మంత్రిగా ఉండి కూడా పని చేయించలేని వ్యక్తి.. రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడో ఆలోచించాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని, సీఎం కేసీఆర్తో మాట్లాడి పేద ప్రజల కోసం నియోజకవర్గానికి ఐదు వేల ఇండ్లు మంజూరు చేయించి కట్టిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలు చేస్తున్నారని, పేదలను ఆదుకుంటున్నారన్నారు. మనసొంటి పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నాయా.. ఆ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే వారిని ఆశీర్వదించాలని, ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని శిరసు వంచి కోరారు. ఇక్కడ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు, ఎంపీపీ పావనీ వెంకటేశ్, సర్పంచులు కలాల రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరన్న, ఉప సర్పంచ్ రవి, టీఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీనివాస్రెడ్డి, యాళ్ల రవీందర్రెడ్డి ఉన్నారు.