గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
పంచాయతీ కార్యదర్శులకు డీపీవో వీర బుచ్చయ్య సూచన
కొత్తపల్లి, ఫిబ్రవరి 9: పంచాయతీ కార్యదర్శులు ఒత్తిడిని అధిగమించి పని చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పేరొన్నారు. బుధవారం స్థానిక ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ జిల్లా, డివిజన్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన డీపీవో వీర బుచ్చయ్య నూతనంగా ఎన్నికైన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు పై అధికారులకు తెలియజేస్తే తప్పకుండా పరిషరిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జేపీఎస్ ఈసాం వెంకటేశానికి పంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవోల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు దివ్యదర్శన్, పలువురు ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా సంఘం కార్యవర్గం
జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం గౌరవాధ్యక్షుడిగా గౌరీ రమేశ్, అధ్యక్షుడిగా సీనియర్ పంచాయతీ కార్యదర్శి జున్నోతుల రేవంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా కిషన్ ఇంగే, ఉపాధ్యక్షులుగా రమేశ్, పవన్ కుమార్, సత్యనారాయణరెడ్డి, విజయలక్ష్మి, హనీ ఫొద్దీన్, కోశాధికారిగా జయరాజ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.