జగిత్యాల : కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికుల కథనం మేరకు..జిల్లాలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన గంగుల చిన్న గంగారాం గొర్రెల మంద పై వేకుజామున కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మరో అయిదు గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి.