జగిత్యాల అర్బన్, డిసెంబర్ 23: అభివృద్ధి పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 44వ వార్డు ఖాజీపురలో రూ.5లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ, సీసీ రో డ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
పట్టణంలోని కండ్లపెల్లి చెరువు, మోతె చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. పనుల్లో అలసత్వంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. చెరువు కట్ట అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డీఈ రాజేశ్వర్ రావు, ఏఈ అయూబ్ ఖాన్, కౌన్సిలర్లు క్యాదాసు నవీన్, పంబాల రాము, తోట మల్లికార్జున్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, నాయకులు సాగర్ రావు, దుమాల రాజ్ కుమా ర్, డిష్ జగన్, సుల్తాన్ అహ్మద్, కో ఆప్షన్ మెంబర్ రియాజ్, ఫరూఖ్, అమీన్, ఏఈ శరత్ తేజ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆహ్వానపత్రం అందజేత
శంషాబాద్లో ఫిబ్రవరి 2నుంచి 12వ తేదీ వరకు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామనుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనాలని వికాస తరంగిణి సభ్యులు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఆహ్వానించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసిన ఈ మేరకు ఆ హ్వానపత్రం అందజేశారు. వికాస తరంగిణి మహి ళా జిల్లా అధ్యక్షురాలు జమున ఉన్నారు.