జగిత్యాల అర్బన్, జనవరి 28: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, ఎంసీహెచ్ హాస్పిటల్లోని అదనపు పడక గదుల భవన నిర్మా ణ పనులను అధికారులు, గుత్తేదారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరిలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా మెడికల్ కాలేజీ పనులను పరిశీలించినట్లు తెలిపారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షిణా దేవి, ఆర్ఎంవో రామకృష్ణ, సీపీవో పూర్ణచందర్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.