మల్లాపూర్: మొగిలిపేట గ్రామ శివారులోని గోదావరి నదిలో మండలంలోని కుస్తాపూర్ గ్రామానికి చెందిన మంద రాములు (55) అనే వ్యక్తి శనివారం గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మొగిలిపేటకు చెందిన సమీప బంధువు చనిపోవడంతో రాములు అంత్యక్రియల్లో పాల్గొని అనంతరం గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో గలంతయ్యాడు. ఘటనాస్థలిని తహసీల్దార్ రవీందర్ పరిశీలించి గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.