కథలాపూర్, ఫిబ్రవరి 21: పంటల మార్పిడితోనే రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం కథలాపూర్ మండలం భూషణరావుపేట, కథలాపూర్, బొమ్మెన గ్రామాల్లో రైతు వేదికలను జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు రూ. 6 కోట్లతో మండలంలోని భూషణరావుపేట నుంచి కోరుట్ల మండలం పెద్దగుండు వరకు నిర్మించే తారు రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఊట్పల్లి-ఆత్మకూర్ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. మండలంలోని 40 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్బాబు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ వరదకాల్వ నుంచి కథలాపూర్ మండలంలోని గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాళ్లవాగు ప్రాజెక్టు కుడి కాల్వ భూ నిర్వాసితుల విషయంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. మండలంలోని సిరికొండలో యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ దొప్పల హైమావతీజలేంధర్ కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఊట్పల్లి మహిళా సమాఖ్య భవనం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్లు అందిస్తామన్నారు. భూషణరావుపేట రైతువేదిక వరకు సీసీ రోడ్డు మంజూరుకు కృషి చేస్తామన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. కథలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం భవనం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఆ సంఘం నేతలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. గంభీర్పూర్లో టీఆర్ఎస్ నాయకుడు బూస రమేశ్ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఏఎంసీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్రావు, ఏవో యోగితా, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో నవీన్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడీల గంగాప్రసాద్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపెల్లి గంగారెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, సింగిల్విండో చైర్మన్ చుక్క దేవరాజం, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్రావు, కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కూన సులోచన, కొండ ఆంజనేయులు, గజ్జెల స్వామి, బాదినేని రమేశ్, కంటె నీరజ, పిడుగు లావణ్య, దొప్పల హైమావతి, అంబటి లత, జవిడి ప్రతాప్రెడ్డి, చీటి విద్యాసాగర్రావు, నల్ల గంగాధర్, నాంపెల్లి లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.