కోరుట్ల : మండలంలోని అయిలాపూర్ గ్రామంలో మద్యం షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ గౌడ కులస్తులు శనివారం సీఎం కేసీఆర్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధాసందయ్య, సంఘం అధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ అంజమ్మ, శంకర్, వెంకటస్వామి, అనంతస్వామి, గంగాధర్, తుక్కారెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.