ఎన్నికల్లో గులాబీదే విజయం
ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ప్రజలకు విముక్తి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
ఇల్లందకుంట, జూన్ 26: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వెంటనే ఉ న్నారని, ఎన్నికల్లో గులాబీదే విజయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండ లం బూజునూర్, సీతంపేట గ్రామాల్లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశా రో ప్రజలకు చెప్పాలని, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ సమస్య పరిషరించలేదో చెప్పాలని నిలదీశారు. సొంత తమ్ముడి లాగా సీఎం కేసీఆర్ ఆదరించి ఈటలను అకున చేర్చుకుని ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తే వెన్నుపోటు పొడిచేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది గులాబీ జెండాపైన అని మరిచిపోవద్దని సూచించారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డివిరుస్తున్న బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలిగిందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారని పునరుద్ఘాటించారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు సరిగొమ్ముల అరుణ-సదానందం, వెంకటస్వామి, ఎంపీటీసీలు పెద్ద ఓదెలు, ఎక్కటి సంజీవరెడ్డి, రమ, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, పున్నం వాసుదేవరెడ్డి, ముస్తఫా తదితరులున్నారు.